విశాఖ జిల్లాలో 70వేల టన్నుల సామర్థ్యంతో కూడిన మూడు ప్రధాన గోదాములు పెందుర్తి, అనకాపల్లి, పరవాడలో ఉన్నాయని పౌర సరఫరాల సంస్థ (సీఎస్సి) జిల్లా మేనేజరు పి.వెంకటరమణ అన్నారు. వాటిల్లో సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని నిల్వ చేయనున్నామని అన్నారు. జిల్లాలో బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నందున తొలి విడతలో తూర్పుగోదారి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సార్టెక్స్ చేసిన 35 వేల టన్నుల బియ్యం తెప్పిస్తున్నామని, ఇవి వారం రోజుల వ్యవధిలో విశాఖలోని ప్రధాన గోదాములకు చేరనున్నాయని అన్నారు.
*జిల్లా అవసరాలకు నెలకు 18500 టన్నుల బియ్యం అవసరం. ప్రస్తుతం తాము తెస్తున్న బియ్యం రెండు నెలలకు సరిపోతాయి. తదుపరి జిల్లాలోని 24 సార్టెక్స్ మిల్లుల నుంచి బియ్యం అందుబాటులోకి వస్తుంది. ప్రధాన గోదాముల నుంచి సీఎస్సీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఉన్న 30 గోదాములకు పంపి, అక్కడి నుంచి డీలర్లకు సరఫరా చేస్తాం.
ట్రక్కులో ఉండే సదుపాయాలు..
*ట్రక్కు సామర్థ్యం 3 టన్నులు
*ప్రతి వాహనానికి జీపీఎస్ సదుపాయం
*ఎలక్ట్రానిక్ తూకపు యంత్రం
*ఈ-పోసు యంత్రాలు
*ధరలు తెలియజేసే ఎలక్ట్రానిక్ బోర్డు