ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం మెండుగా.. పేదలకు దాతలు అండగా!

రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరాశ్రయులకు, పేదలకు.. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వారికి ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. కరోనా కట్టడిలో ముఖ్య భూమిక పోషిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులను ప్రజలు కొనియాడుతున్నారు.

By

Published : Apr 19, 2020, 8:55 PM IST

Distribution of Essential Commodities for the Poor in lavore
శ్రీకాకుళం జిల్లా లావేరులో నిత్యవసరాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రామచంద్రాపురం, పొన్నంపేట గ్రామాల్లో ఎన్ఎస్ఎస్​పీఓ రవిబాబు.... విద్యార్థులతో సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల వద్ద మురికి, చెత్త తొలగించి బ్లీచింగ్ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు.

లావేరు మండలం పాతరౌతుపేట గ్రామంలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ నిత్యావసరాలు అందజేశారు. సుమారుగా 750 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్​డౌన్ పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి కుటుంబానికి స్థానిక వైకాపా నాయకులు కొమ్ము సాయి, రఘుమండల కృష్ణారావు, కొమ్ము గాంధీ తమ సొంత నిధులతో నిత్యావసరాలను పంపిణీ చేశారు.

విశాఖ జిల్లాలో...

అనకాపల్లి మండలం సీహెచ్ఎన్ అగ్రహారంలో తెదేపా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1200 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా కూరగాయల పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

చోడవరంలో అధికార పార్టీ నాయకులు చేసే కార్యక్రమాలపై పోలీసులు దృష్టి పెట్టారు. వారు నిర్వహించే విలేకరుల సమావేశం, పంపిణీ కార్యక్రమాలకు పోలీసులు హాజరవుతున్నారు. సింహాద్రిపురంలో మాజీ సర్పంచ్, వైకాపా నాయకుడు శ్రీనివాసరాజు ప్రజలకు నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ, శిక్షణ డీఎస్పీ డా.రవికిరణ్, ఎస్సై లక్ష్మీ నారాయణ హాజరయ్యారు.

అనకాపల్లి ఉన్నత పాఠశాలలో 2007-08 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు... 100 రిక్షా కార్మికుల కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

అనంతపురం జిల్లాలో...

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరంపురంలో ఉపాధి లేక చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వీరికి పసుపుల బ్రదర్స్ ఆధ్వర్యంలో రెండో సారి 15 లక్షల రూపాయలతో 950 కుటుంబాలకు 22 రకాల నిత్య అవసర సరుకులను పంచారు.

ఉరవకొండ పట్టణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు.. పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు వార్తలను సేకరిస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులను వారు అభినందించారు. వారిని గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లాలో కూలీ పనుల కోసం వచ్చి... లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి హోప్ సంస్థ అండగా నిలిచింది. పేరెచర్ల ప్రాంతంలో ఉన్న కూలీలు తినటానికి తిండి లేక ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకుని వారికి సరుకులు అందజేసింది. దాదాపు 201 కుటుంబాలకు 10 కిలోల బియ్యం, 5 కిలోల కూరగాయలు, 7 రకాల వంట సరుకులను పంపిణీ చేశారు.

ప్రకాశం జిల్లాలో..

కనిగిరి నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సౌజన్యంతో ...పామూరులో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ కందిపప్పు, కేజీ ఉప్పు, కేజీ ఉల్లిపాయలు, రెండు సబ్బుల వంతున 250 కుటుంబాలకు సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల తేదేపా కమిటీ సభ్యులు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో...

కడప జిల్లా రైల్వే కోడూరు రైల్వే ఉద్యోగులు పేదవారికి నిత్యావసర సరుకులు, భోజనం అందజేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని పేద ప్రజలకు గత 25 రోజులు నుంచి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు అన్నదానం చేశారు.

ప్రొద్దుటూరులో ఆశా వ‌ర్క‌ర్లకు నిత్యావ‌స‌ర సరుకులు పంపిణీ చేశారు. పుర‌పాలిక కార్యాల‌యంలో షిరిడీ సాయి ఎల‌క్ట్రిక‌ల్స్ స‌హ‌కారంతో స‌రుకులు అందించారు. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డిలు వాటిని ఆశా వ‌ర్క‌ర్ల‌కు అందించారు.

మైదుకూరు ఇందిరమ్మకాలనీకి చెందిన వైకాపా 23వ వార్డు బాధ్యుడు బాబా ఫకృద్దీన్‌ ,ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆదేశాలతో 600 పేద కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లాలో..

వెంకటగిరి పట్టణంలో ఇద్దరు తేదేపా నేతలు నిత్యావసరాలు, కూరగాయలను ఇంటింటికీ పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పులి కొల్లు రాజేశ్వరరావు, పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్ విశ్వనాథ నాయుడు కలిసి 550 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. పురపాలక సంఘం పరిధిలోని పాతకోట, వెలంపాలెం వీధుల్లో ఇంటింటికి వెళ్లి అందించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

రాజమహేంద్రవరంలో 600 పురోహితులు, అర్చకులకు నిత్యావసర కిట్లను ఎంపీ మార్గాని భరత్‌ పంపిణీ చేశారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సహాయం చేసినట్టు చెప్పారు.

లాక్​డౌన్ నేపథ్యంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో లెనోరా విద్యాసంస్థల డైరెక్టర్ జాన్ రత్నం పేదలకు నిత్యావసర సరుకులను అందించారు. వారికి అండగా చేయూతనివ్వడం అభినందనీయమని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సమకూర్చిన నిత్యవసర సరుకులను పోలీస్ సిబ్బందికి, హోంగార్డులకు అందజేశారు.

కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా అవనిగడ్డ హరి ఆప్టికల్స్ షాపు యజమాని హరినాధబాబు సుమారు 12 వేల రూపాయలు విలువ చేసే 27 కూలింగ్ కళ్లజోళ్లను కోడూరు పోలీసులకు అందించారు.

ఇదీ చూడండి:

'కాళ్లు మొక్కుతాం.. అడుగు బయట పెట్టొద్దు'

ABOUT THE AUTHOR

...view details