రిక్షా కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - essential needs latest news vishaka district
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రిక్షా కార్మికులకు పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు లాక్డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్లబాబు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వైకాపా నాయకుడు దగ్గుపల్లి సాయిబాబా అర్ధిక సహయంతో వీటిని పంపిణీ చేసారు. స్థానిక పంచాయతీ కూడలిలో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంచిపెట్టారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో నాయకులు చిక్కాల రామారావు, దనిశెట్టి బాబూరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.