ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా భయం.. కనుమరుగైన మానవత్వం

అనంతపురం జిల్లాలో క్వారంటైన్​లో ఉంటున్న వలస కూలీలు అదికారులతో ఘర్షణకు దిగారు. ఒకే గ్రామానికి చెందినవారున్న క్వారంటైన్​లోకి బయటవారిని తీసుకువచ్చారని ఆరోపించిన వలసకూలీలు సదరు వ్యక్తిని బయటకు పంపాలని రాత్రి భోజనం తినకుండా నిరసన వ్యక్తం చేశారు.

By

Published : May 8, 2020, 9:43 AM IST

Published : May 8, 2020, 9:43 AM IST

dispute to Quarantine members at anantapuram
క్వారంటైన్​లో ఉంటున్న వలస కూలీలు

అనంతపురం జిల్లా చిన్నముస్తూరు మోడల్‌ స్కూల్​ వద్ద క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నవారు ఘర్షణకు దిగారు. ఒకే గ్రామానికి చెందిన 161 మంది ఉన్న కేంద్రంలోకి మరో వ్యక్తిని తెచ్చారని ఆరోపించారు. బయట గ్రామం నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని క్వారంటైన్‌ కేంద్రం నుంచి పంపిచాలంటూ ఆందోళనకు దిగారు. సదరు వ్యక్తిని బయటకు పంపాలంటూ రాత్రి భోజనం మానేసి వలస కూలీలు నిరసన తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details