విశాఖ రేంజ్ పరిధిలో ఈ నెల 9న జరగనున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం రేంజ్ పరిధిలో 582 పంచాయతీలకు ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఐజీ కోరారు.
'ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 144 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా, 206 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాం. సుమారుగా 4,500 మంది పోలీసులతో ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు' అని డీఐజీ రంగారావు హెచ్చరించారు.
ముగిసిన చివరి రోజు ప్రచారం...
పార్టీలకు అతీతంగా సర్పంచులను ఎన్నుకోవాలని ప్రజలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వైకాపా మద్దతుదారు అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనకాపల్లి డివిజన్లో..
అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మారేడు పూడి, మాకవరం, బవులవాడ గ్రామాల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విస్తృతంగా ప్రచారం చేశారు.
మాడుగుల నియోజకవర్గంలో..