విశాఖ మన్యంలో డయేరియా విజృంభిస్తోంది. డుంబ్రిగుడ మండలంలోని పోతంగి గ్రామంలో వాంతులు, విరేచనాలతో 40 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రక్షిత మంచినీరు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... తరచూ రోగాలు తమను వేధిస్తున్నాయని గిరిజనులు వాపోతున్నారు.
గ్రామంలోని తాగునీటి అవసరాలకు కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి పైకప్పు లేకపోవడంతో నీరంతా కలుషితమవుతోందని గిరిజనులు అంటున్నారు. నీరు నాచు పట్టి తాగేందుకు వీలు లేని విధంగా ఉన్నాయంటున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నీళ్లే తాగుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.