విశాఖ ఎంవీపీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇందుకోసం మూల విరాట్ను 17 కిలోల చందనం, వివిధ రకాల పండ్లతో సుందరంగా అలంకరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు.
ఎంవీపీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ధనుర్మాస శోభ - విశాఖపట్నం వార్తలు
ధనుర్మాసం సందర్భంగా విశాఖ ఎంవీపీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం నేపథ్యంలో.. స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

విశాఖ ఎంవీపీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస శోభ