ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకరావుపేటలో చిలకల తీర్థం.. పోటెత్తిన భక్తులు - heavy floating at Chilakala tirtha

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఉగాది రోజు సంప్రదాయబద్ధంగా జరుపుకునే చిలకల తీర్థంలో భక్తులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. అధికారులు కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య తీర్థం నిర్వహించారు.

Devotees heavy floating at Chilakala tirtha
చిలకల తీర్థంలో భక్తుల సందడి

By

Published : Apr 13, 2021, 10:03 PM IST

చిలకల తీర్థంలో భక్తుల సందడి

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రసిద్ధి చెందిన చిలకల తీర్థానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా ఉగాది రోజు ఈ తీర్థం నిర్వహిస్తారు. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, తుని, కోటనందూరు, తొండంగి, అన్నవరం, నక్కపల్లి, రాయవరం, తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. తీర్థంలో పంచదార చిలకలు, చాటలు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. రామాలయంలో పూజలు చేసి అనంతరం ఉగాది పంచాంగం చెప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇదీ చూడండి:ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్

గత ఏడాది కొవిడ్ కారణంగా ఈ వేడుక నిర్వహించలేదు. కొవిడ్ నిబంధనల మేరకు ఈ ఏడాది తీర్థం నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దలు, పిల్లలు అని తేడా లేకుండా సందడి చేశారు.

ఇదీ చదవండి:

వైభవంగా ఇంద్రకీలాద్రిపై ఉగాది మహోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details