మట్టి గణపతులను పూజిద్దాం..ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని విస్మరిద్దాం .
విశాఖ జిల్లా అనకాపల్లి దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలు చేతపట్టుకొని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలంటు నినాదాలు చేశారు.మట్టివినాయకల వాడకం పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందో వారు వివరించారు.