ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 4:00 PM IST

ETV Bharat / state

రైలు ఢీకొని బధిర బాలుడు మృతి

ఆ బాలుడు పుట్టుకతోనే బధిరుడు. పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితుడిని కలుద్ధామని వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరే క్రమంలో రైలు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగింది.

Deaf boy died in train accident
బధిర బాలుడు మృతి

పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని బధిర బాలుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నంలో జరిగింది. వేపగుంట చీమలాపల్లికి చెందిన అప్పలకొండ, మహాలక్ష్మి దంపతుల కుమారుడు మోహన కృష్ణ(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మిత్రుడిని కలిసేందుకు గోపాలపట్నం వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరే క్రమంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది.

తీవ్రగాయాలైన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైలు శబ్దం వినిపించకపోవటం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details