మారుమూల గిరిజన ప్రాంతాలు ఇంకెన్ని రోజులు అభివృద్ధి లేకుండా ఉండిపోవాలి అంటూ.. విశాఖ జిల్లా సిరిలీమెట్, కేందుగుడా, పిట్టగడ్డ, కీముడుపుట్టు గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. తమ వారికి పురిటి నొప్పులు వస్తే చావే గతి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మారుమూల ప్రాంతాలకు రహదారులను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తమ కష్టాలు తీర్చాలనీ.. ఉపాధి హామీ పని రోజులు పెంచాలన్నారు. తమ ప్రాంతాాలకు సెల్టవర్లు, రహదారులు వస్తే సమస్యలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మావోయిస్టుల వలనే అభివృద్ధి ఆగిపోతుందనీ.. ఇంకా వారికి భయపడేది లేదని గిరిజనులు స్పష్టం చేశారు.
మావోయిస్టులకు గట్టి దెబ్బ