విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాకులు మృతి కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో పక్షులు చనిపోవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితమే అచ్యుతాపురం మండలంలో కొన్ని కాకులు చనిపోయాయి. వాటి మృతికి బర్డ్ ఫ్లూ వైరస్కు సంబంధం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
విశాఖలో కాకుల మృతి.. అధికారులు ఆరా! - atchutapuram latest news
విశాఖలో కాకుల మృతి కలకలం రేపుతోంది. అచ్యుతాపురంలో కొన్నిరోజుల క్రితం కొన్ని కాకుల మృతిచెదంగా.. తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాకులు చనిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటి మృతికి కారణం బర్డ్ ఫ్లూనా లేక వేరే ఏదైనా కారణమా..? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
![విశాఖలో కాకుల మృతి.. అధికారులు ఆరా! crows died near visakhapatnam collector office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10201202-1085-10201202-1610365373991.jpg)
విశాఖలో కాకుల మృతి
అయితే సరిగ్గా ఒకరోజు తేడాతోనే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఆరు కాకులు నిమిషాల వ్యవధిలోనే గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి. వీటి మృతిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే పక్షులు మృతిచెందడంతో.. వాటి మృతికి కారణాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చదవండి:కలకలం రేపుతోన్న కాకుల మృతి..కారణాలను అన్వేషిస్తున్న అధికారులు