ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉత్తరాంధ్రలో భూములు అమ్మి కోస్తాంధ్రాలో పెడతారా..?' - cpi leader JV Sathyanarayana comments on ysrcp

వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలకు తెరతీసే ప్రయత్నాలు చేస్తోందని... భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత జె.వి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బిల్డ్ ఏపీ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను అమ్మి... వచ్చిన డబ్బుతో రాయలసీమ, కోస్తా ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీ మండిపడుతున్న సత్యనారయణమూర్తి

By

Published : Nov 22, 2019, 8:33 PM IST

'ఉత్తరాంధ్రలో భూములు అమ్మి కోస్తాంధ్రాలో పెడితో ఊరుకోం'
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సీపీఐ సీనియర్ నేత జేవీ సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూమూలను అమ్మి... కోస్తా, రాయలసీమను అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఎస్​ఈ జెడ్​ల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసిందన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని... ఎలాంటి పరిశ్రమలు స్థాపించని వారినుంచి భూములు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములు అమ్మే కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని... లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకుని ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details