విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఆలయ ఆవరణలో లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకు వచ్చిన కానుకలను ఆలయ ఈఓ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 28,21,725, బంగారం 66.200 గ్రాములు, వెండి 285 గ్రాములు లభించింది. ఆలయ ఈవో ఎస్జే మాధవి పర్యవేక్షణలో ఈ లెక్కింపు సాగింది. దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్ కుమార్, ఆలయ ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, పర్యవేక్షకులు త్రిమూర్తులు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరిభావననారాయణ పాల్గొన్నారు.
కనకమహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 28 లక్షలు - visakha district newsupdates
విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీలను ఆలయ ఈవో ఎస్జే. మాధవి, దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్కుమార్, ఆలయ ఏఈవోల పర్యవేక్షణలో లెక్కించారు.
![కనకమహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 28 లక్షలు Counting of hundis at Kanakamahalakshmi Ammavari temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10069000-701-10069000-1609404647560.jpg)
విశాఖలోని కనకమహాలక్ష్మి ఆలయంలో హుండీల లెక్కింపు