విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ విభాగంలో పని చేస్తున్న ఓ సీఐకి కరోనా వచ్చింది. అతనికి పాజిటివ్ అని తేలడంతో అతనితో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో సన్నిహితంగా ఉన్న పోలీసులు ..ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు స్టేషన్ల పరిధిలో 30 మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.
సీఐకి కరోనా పాజిటివ్.. సిబ్బందిలో మొదలైన ఆందోళన - విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ వార్తలు
విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ విభాగంలో పని చేస్తున్న సీఐకి కరోనా సోకింది. అతనికి పాజిటివ్ అని తేలడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
![సీఐకి కరోనా పాజిటివ్.. సిబ్బందిలో మొదలైన ఆందోళన corona positive to ci at visakha city police commissionerate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7693270-1013-7693270-1592630185025.jpg)
సీఐకి కరోనా పాజిటివ్