ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 21, 2020, 8:17 PM IST

ETV Bharat / state

చోడవరంలో తెదేపా నాయకుడి సహా 18 మందికి కరోనా

విశాఖ జిల్లా చోడవరంలో తాజాగా 18 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో తేదేపా నాయకుడు ఒకరున్నారు. చోడవరంలో 11 కేసులు బయటపడగా.. మండలంలోని గవరవరంలో 7గురికి పాజిటివ్​గా తేలింది.

corona cases in chodavaram vizag district
చోడవరంలో తెదేపా నాయకుడి సహా 18 మందికి కరోనా పాజిటివ్

విశాఖ జిల్లా చోడవరంలో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 4 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నేడు విడుదల చేసి కొవిడ్ బులెటిన్​లో 18 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. చోడవరంలో 11 కేసులు నమోదుకాగా.. మండలంలోని గవరవరం పీహెచ్​సీ పరిధిలో 7గురికి పాజిటివ్​గా తేలింది.

గోవాడలోని తెదేపా నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పూతి కోటేశ్వరరావు, ఆయన కుమారుడు కరోనా బారిన పడ్డారు. చోడవరంలో పరీక్ష ఫలితాలు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. తాను హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details