ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2020, 5:09 PM IST

ETV Bharat / state

చోడవరంలో కరోనా విజృంభణ... మరో ఏడు కొత్త కేసులు నమోదు

విశాఖలోని చోడవరం పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పట్టణంలో ఇప్పటివరకు 71 మంది కోవిడ్ బారిన పడగా వీరిలో... 20 మంది హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు.

corona cases are increasing in chodavaram at vishaka
చోడవరంలో కరోనా విజృంభణ... మరో ఏడు కొత్త కేసులు నమోదు

విశాఖలోని చోడవరం పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ వైద్య నివేదిక ప్రకారం పట్టణానికి చెందిన మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఓ మహిళా ఏఎస్సై, ఓ దినపత్రిక కంట్రిబ్యూటర్, బ్యాంకు ఉద్యోగిని ఉన్నారు.

చోడవరంలో ఇప్పటి వరకు 71 మంది కోవిడ్ బారిన పడగా వీరిలో... 20 మంది హోమ్ క్వారంటైన్​లో ఉంటున్నారు. పోలీస్ స్టేషన్​లో నలుగురు సిబ్బంది, సర్కిల్ కార్యాలయంలో హెచ్​సీ, మహిళా హోమ్ గార్డులతో పాటు వెంకన్నపాలెం చెక్ పోస్టు వద్ద పనిచేసే ఏఎస్సె, హెచ్​సి, పొరుగు సేవల సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details