కూలీలకు వంట పాత్రలు.. వస్త్రాలు పంపిణీ - కూండ్రపువానిపాలెంలో సరకుల పంపిణీ
విశాఖ జిల్లా కూండ్రపువానిపాలెంలో కూలీలకు శ్రీ రావాలమ్మ తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం తరుపున కూలీలకు వంటపాత్రలు, దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కె.కోటపాడు ఎస్ఐ మల్లేశ్వరరావు చేతులమీదుగా వాటిని అందజేశారు.
![కూలీలకు వంట పాత్రలు.. వస్త్రాలు పంపిణీ Cooking utensils for laborers .. Distribution of textiles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9318821-984-9318821-1603722435899.jpg)
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కూండ్రపువానిపాలెం గ్రామానికి చెందిన శ్రీ రావాలమ్మ తాపీమేస్త్రీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూలీలకు వంటపాత్రలు, మహిళలు, పురుషులకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.కోటపాడు ఎస్ఐ మల్లేశ్వరరావు హాజరయ్యారు. ఆయన చేతులమీదుగా 70 మంది కూలీలకు రూ.2.50 లక్షల విలువైన సామాగ్రి అందజేశారు. కారోనాతో కష్టకాలంలో ఉన్న కూలీలకు శ్రీ రావాలమ్మ తాపీమేస్త్రీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సేవలు అభినందనీయమని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పలనాయుడు, పీఆర్టీయూ కె.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.