ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనుమానాలున్నాయి.. సమగ్ర విచారణ చేపట్టండి' - medical officer sheyamala death

విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో ఆగస్టు నాలుగో తేదీన మృతి చెందిన వైద్యాధికారిణి శ్యామల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి బంధువులు ఆందోళన చేశారు.

comprehensive inquiry should be held into the death of the medical officer Shyamala in kashimkota vizag district
కశింకోటలో ఆందోళన

By

Published : Sep 22, 2020, 9:15 PM IST

విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆగస్టు నాలుగో తేదీన వైద్యాధికారిణి శ్యామల మృతదేహాన్ని గుర్తించారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానించిన పోలీసులు.. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో శ్యామల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడితే వాస్తవాలు తెలుస్తాయని కోరారు.

తల్లిదండ్రులు లేకపోయినా భర్త, అత్తామామల సహకారంతో శ్యామల కష్టపడి చదివి వైద్యురాలిగా ఉద్యోగం సాధించిందని, ఎవరో హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీచదవండి.

ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ABOUT THE AUTHOR

...view details