ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎల్జీ పాలిమర్స్ ఘటన: అస్వస్థతకు గురైన బాధితులకు పరిహారం

By

Published : Jun 20, 2020, 8:01 AM IST

ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు పూర్తి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

full compensation for vizag gas leak victims
స్టైరీన్‌ బాధితులకు పరిహారం

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరీన్‌ లీకైన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులకు మిగిలిన పరిహారాన్ని అధికారులు అందిస్తున్నారు. లక్ష రూపాయల పరిహారం ఇవ్వాల్సిన బాధితుల్లో కొంతమందికి 75 వేల రూపాయలే ఇచ్చారని, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి అసలు ఇవ్వలేదని ఈ నెల 15న ‘పరిహారానికి ఎదురుచూపు’ శీర్షికన ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు.

75 వేల రూపాయలే అందుకున్నవారిలో ఇప్పటికి 10 మందికి మిగిలిన 25 వేల రూపాయలు చెల్లించారు.. మరికొందరికి నిధులు మంజూరయ్యాయని, రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తామని జిల్లా వైద్యశాఖాధికారి తిరుపతిరావు చెప్పారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, పరిహారం అందని వారి నుంచి కలెక్టరు కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరికీ పరిహారం ఇస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభనతో మరింత అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details