ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2020, 1:23 AM IST

ETV Bharat / state

పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ ఆందోళన

కరోనా విజృంభిస్తోన్న క్రమంలో ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని... నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు ఆందోళనకు దిగారు. రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

citu leaders reacts on corona
కరోనా సమయాల్లో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సీఐటీయూ ఆందోళన

కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కుటుంబానికి రూ. 7,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని... విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details