విశాఖపట్నంలోని హిందుస్థాన్ జింక్ భూములను వేదాంత కంపెనీకి ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని జింక్ కంపెనీ నిర్వాసితులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. హిందుస్థాన్ జింక్ పరిశ్రమ ఏర్పాటు కోసం 1971లో రైతులు 365 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. హిందుస్థాన్ జింక్ కంపెనీ మూసివేసి వాటి స్థానంలో కాలుష్యం లేని ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని.. ఆ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆ భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని నగర సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడికి తలొగ్గకుండా ప్రజల పక్షాన నిలవాలని కోరారు.
హిందుస్తాన్ భూములను వేదాంతాకు అప్పగించొద్దు..! - visakhapatnam
విశాఖలోని హిందుస్థాన్ జింక్ భూములను వేదాంత కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేస్తే, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని జింక్ నిర్వాసితులు, కార్మిక సంఘాల నాయకులు సీఐటీయూ కార్యక్రమంలో హెచ్చరించారు.
![హిందుస్తాన్ భూములను వేదాంతాకు అప్పగించొద్దు..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4131493-515-4131493-1565764783589.jpg)
హిందుస్తాన్ భూములను వేదాంతాకి అప్పగించొద్దు..!
హిందుస్తాన్ భూములను వేదాంతాకి అప్పగించొద్దు..!
ఇదీ చూడండి:క్యూఆర్ కోడ్లతో కుటుంబ ఆరోగ్య కార్డులు..!