ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 26, 2020, 9:11 PM IST

ETV Bharat / state

'వైకాపా పాలన మూడు పథకాలు...ఆరు ఫలాలుగా సాగుతోంది'

విశాఖ జిల్లా చోడవరం మండలం చాకిపల్లిలో ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రామజోగిపాలెం, కన్నంపాలెంలో పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదన్న ప్రజలకు సమాధానమిచ్చారు.

mla karanam
మహిళలకు సమాధానమిస్తున్న ఎమ్మెల్యే

మహిళలకు సమాధానమిస్తున్న ఎమ్మెల్యే

విశాఖ జిల్లా చోడవరం మండలం చాకిపల్లిలో ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ రచ్చబండ కార్యక్రమంలో నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అందడంలేదని కొందరు మహిళలకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొందరికి సంక్షేమపథకాలు అందలేదని, ఆ సమస్యలు పరిష్కరించి లబ్దిదారులందరికీ పథకాలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

రచ్చబండ నిర్వహణలో భాగంగా.. రామజోగిపాలెం, కన్నంపాలెంలో ఎమ్మెల్యే పర్యటించారు. నివర్ ప్రభావంతో వర్షం పడుతున్నా.. గొడుగులు చేతబట్టి పాదయాత్ర చేశారు. జగనన్న పాలన మూడు పథకాలు..ఆరు ఫలాలుగా సాగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details