విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్య తరహా జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎండలకు చెరకు, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులు తాగడానికి నీరు లభించలేదని వాపోతున్నారు. జలవనరుల శాఖ అధికారులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
'పంటలు ఎండిపోతున్నాయి... నీరు విడుదల చేయండి' - చీడికాడ మండలం రైతుల కష్టాలు
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనాం మధ్య తరహా జలాశయం నుంచి నీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని అధికారులను కోరుతున్నారు.

చీడికాడ మండలం రైతుల కష్టాలు
TAGGED:
చీడికాడ మండలం రైతుల కష్టాలు