ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - cj visited simha chalam appanna swamy temple

సింహాచలం అప్పన్నస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి దర్శించుకున్నారు. స్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో వెంకటేశ్వరరావు... సీజేకు అందించారు.

Chief Justice of the High Court
అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

By

Published : Nov 30, 2019, 4:27 PM IST

అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సింహగిరిపై కొలువైన శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారిని... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరీ దర్శించుకున్నారు. చీఫ్ జస్టిస్​కు కొండపై ఘనస్వాగతం లభించింది. ఆలయ ఈవో... పూర్ణకలశంతో ఎదురెళ్లి నాదస్వరం మేళ తాళాలతో ఆహ్వానించారు. వేదపండితులు చీఫ్ జస్టిస్​కు అశీర్వచనం పలుకగా... అంతరాలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. పూజ అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు... జస్టిస్ మహేశ్వరీకు స్వామి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details