విశాఖ జిల్లా నాతవరం మండలం జిల్లేడపూడి వద్ద నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 3250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ, కోడి పందాల నిర్వహణ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం రూరల్ సీఐ అప్పలనాయుడు హెచ్చరించారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
3250 లీటర్ల ఊట బెల్లం ధ్వంసం చేసిన పోలీసులు - visakha district nathavaram mandal latest news
విశాఖ జిల్లా నాతవరం మండలం జిల్లేడపూడి సమీపంలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేసి.. 3250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![3250 లీటర్ల ఊట బెల్లం ధ్వంసం చేసిన పోలీసులు cheap liquor caught by narsipatnam rural police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7670563-425-7670563-1592495582360.jpg)
నాటుసారా ధ్వంసం చేసిన పోలీసులు