ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారు ఢీ కొట్టి.. పాదచారి మృతి

By

Published : Feb 9, 2021, 6:19 PM IST

రోడ్డు పక్కన నడుస్తున్న ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ పాదచారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం కొండల అగ్రహారంలో జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వ్యక్తిని ఢీకొట్టగా అతను చనిపోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

car hits man in kondala agraharam
కారు ఢీ వ్యక్తి మృతి

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం సమీపంలో కారు ఢీకొని అదే గ్రామానికి చెందిన కుమారస్వామి అనే 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. విశాఖ నుంచి నర్సీపట్నం వస్తున్న కారు కొండల అగ్రహారం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయింది.

ఈ క్రమంలో.. రోడ్డు పక్కనే నడుస్తున్న కుమారస్వామిని బలంగా ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మాకవరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details