ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 9:19 AM IST

ETV Bharat / state

కేబుల్ ఆపరేటర్ అనుమానాస్పద మృతి

కేబుల్ ఆపరేటర్​గా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా జీడిగుమ్మలలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

cable-operator-suspected-death-in-jeegigummala-vizag-district
కేబుల్ ఆపరేటర్ అనుమానాస్పద మృతి

విశాఖ జిల్లా గొలుగొండ మండలం జీడిగుమ్మలకు చెందిన కేబుల్ ఆపరేటర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆడిగర్ల రాము కేబుల్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. శుక్రవారం కొంతమంది స్నేహితులతో కలిసి పెద్దపేట గ్రామంలో మద్యం సేవించడానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో బాగా మద్యం తాగాడని.. ఆ తర్వాత చనిపోయి కనిపించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details