ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారా.. ఒక్కనిమిషం ఆలోచించండి!

ఇటీవల గల్ఫ్ బాధితుల సంఖ్య పెరుగుతోందని.. ఏజెంట్లను నమ్మి చాలామంది మోసపోతున్నారని విశాఖ డీఐజీ రంగారావు అన్నారు. మోసపోయి తిరగొచ్చిన వారు ఫిర్యాదు చేస్తే ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

By

Published : Aug 19, 2019, 11:52 PM IST

గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారా.. ఒక్కనిమిషం ఆగండి

గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారా.. ఒక్కనిమిషం ఆగండి

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు సూచించారు. ఇటీవల గల్ఫ్ బాధితుల సంఖ్య పెరుగుతోందనీ.. ఏజెంట్ల మాయమాటలు నమ్మి నిరుద్యోగ యువత, మహిళలు మోసపోతున్నారని చెప్పారు. ఏజెంట్లను సంప్రదించే ముందు వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. వారు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా అనేది ఆన్​లైన్​లో తెలుసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. మోసపోయిన వ్యక్తులు స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చాక... ఏజెంట్లపై ఫిర్యాదు చేయొచ్చనీ.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details