ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2021, 11:49 AM IST

ETV Bharat / state

నూకాలమ్మ భక్తుల కోసం మజ్జిగ చలివేంద్రం

అనకాపల్లి నూకాలమ్మ జాతరకు విచ్చేసిన భక్తుల కోసం తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణ ఎస్సై స్వామి నాయుడు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

chalivendram at nukalamma jathara
నూకాలమ్మ జాతరలో చలివేంద్రం

ఎండలు మండిపోతున్న తరుణంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో చలివేంద్రాల ఏర్పాటుపై స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. అనకాపల్లి నూకాలమ్మ జాతరకు విచ్చేసిన భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఈ చలివేంద్రాన్ని తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణ ఎస్సై స్వామి నాయుడు చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details