ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రయ్​.. రయ్​ మంటూ పరుగులు తీసిన బస్సులు

ఇన్నాళ్లూ లాక్​డౌన్​ కారణంగా డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్డెక్కాయి. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్​లో బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. 25 బస్సులు నడపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

By

Published : May 21, 2020, 1:30 PM IST

Updated : May 21, 2020, 11:39 PM IST

buses started journey at the Anakapalli RTC complex
అనకాపల్లిలో మొదలైన ఆర్టీసీ సర్వీసులు

లాక్​డౌన్​తో చాలా రోజులనుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం రోడ్డెక్కాయి. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్​లో బస్సుల రాకపోకలతో సందడి నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

నగరం నుంచి విశాఖపట్నం, విజయనగరం, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, పలాస ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నారు. డిపో నుంచి 25 బస్సులు రాకపోకలు చేస్తున్నట్టు డీఎం గిరీష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం చేసిన సూచనలు పాటిస్తున్నామన్నారు.

Last Updated : May 21, 2020, 11:39 PM IST

ABOUT THE AUTHOR

...view details