ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమిలి ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు - bull competition in bhemili

రైతులను ప్రోత్సహించే దిశగా విశాఖలో భీమిలి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.

భీమిలీ ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండి పోటీలు నిర్వహణ

By

Published : Nov 9, 2019, 5:33 PM IST

భీమిలీ ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండి పోటీలు నిర్వహణ

విశాఖలో భీమిలి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమునిపట్నం స్థానిక మినీ క్రీడా మైదానంలో ఎడ్లబండ్ల పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 25 ఎడ్లబండ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ పోటీలను తిలకించేందుకు పలువురు ఆసక్తి చూపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులకు పలు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details