ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 15న భవన నిర్మాణ కార్మికుల 'ఛలో విజయవాడ' - భవన నిర్మాణ కార్మికుల చలో విజయవాడ వార్తలు

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10వేల చొప్పున 6 నెలలపాటు అందించాలని కోరుతూ.. బిల్డింగ్- కన్​స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 15న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో ఈ కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు.

chalo vijayawada
ఈనెల 15న భవన నిర్మాణ కార్మికుల 'చలో విజయవాడ' కార్యక్రమం

By

Published : Dec 13, 2020, 7:22 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఇసుక కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయని భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. ఈ ఏడాది కరోనా కారణంగా నిర్మాణ రంగం కుదేలైందని.. కార్మికులు పనుల్లేక ఆదాయం కోల్పోయారన్నారు. అందుకే నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10వేల చొప్పున 6 నెలలపాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

రాష్ట్రప్రభుత్వం కార్మికుల సంక్షేమ నిధిని ఇతర పథకాలకు ఖర్చు చేస్తోందని కృష్ణారావు ఆరోపించారు. సంక్షేమ బోర్డును మూసివేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ఈ క్రమంలో నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details