ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 10, 2020, 4:35 PM IST

ETV Bharat / state

చరవాణి చూడొద్దన్నందుకు ప్రాణం తీసుకున్నాడు

అధిక సమయం చరవాణి చూడవద్దని మందలించటంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగింది.

boy suspected death in narseepatam vizag district
నర్సీపట్నంలో యువకుడు ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా నర్సీపటంకు చెందిన ఓ యువకుడు... కొంతకాలంగా దుర్గాబజార్‌లో ఉంటున్న తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఏ పని చేయకుండా ఎక్కువ సమయం చరవాణి చూస్తుడంటంపై సోదరి మందలించింది.

ఈ క్రమంలో ఇంట్లో నుంచి పారిపోయి, గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద చెట్టుకు ఉరివేసుకుని సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details