వైకల్యాన్ని ఆమె ఆధ్యాత్మికతతో ఎదుర్కొన్నారు. రిజర్వేషన్ ఉన్నా.. సాధారణ అభ్యర్థులతో పోటీపడి సర్కారు కొలువు సాధించి చూపారు. ఉపాధ్యాయురాలిగా 2 దశాబ్దాలుగా విద్యార్థులను సాన బెడుతున్నారు. ఇప్పుడు బ్రెయిలీ లిపిలో భగవద్గీత రచించి తన విలక్షణతను మరోసారి చాటారు.
వైకల్యం వెంటాడినా.. లక్ష్యాలు
విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు కొల్లూరు లక్ష్మీనారాయణమ్మ.. పుట్టుకతో అంధురాలు. వైకల్యం వెంటాడినా.. ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఉన్నతస్థాయికి చేరుకున్నారు. చదువుపైన ఆసక్తే అందుకు కారణమని చెబుతున్నారు లక్ష్మీనారాయణమ్మ. సాంఘిక శాస్త్రం, తెలుగు భాషలో బీఈడీ చదివిన ఆమె ఏయూలో ఎంఏ పూర్తి చేశారు. హిందీ, బెంగాలీ, సంస్కృతంలపై పట్టు సాధించారు. డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి అంధుల కోటాలో మరొకరికి అవకాశం కల్పించడం విశేషం. తెలుగు భాషపై గల మమకారం వృత్తి జీవితంలో రాణించేందుకూ దోహదం చేసిందని ఆమె చెబుతున్నారు.
బ్రెయిలీలో భగవద్గీత