'అగ్రవర్ణాల పేద విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలి'
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ... బీజేవైఎం సంతకాల సేకరణ చేపట్టింది.ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.
అగ్రవర్ణాల పేద విద్యార్థులకు బాసటగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమని భాజపా నాయకులు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. వెనుకబడిన అగ్రవర్ణాల పేద విద్యార్థుల కోసం పది శాతం రిజర్వేషన్లు కేంద్రం ప్రవేశపెట్టిందని.. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకపోవడం సీఎం జగన్కు తగదని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఇదివరకే ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశామన్నారు.
ఇదీ చూడండి.ఫాస్టాగ్ నిర్వహణ అధ్వానం.. టోల్గేట్ల వద్ద తప్పని నిరీక్షణ