ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2019, 11:42 AM IST

ETV Bharat / state

'కావాలనే మాపై బురదజల్లుతున్నారు'

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని భాజపా రాష్ట్ర యవు మోర్చా ఆరోపించింది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ తెలిపారు.

bjp-youva-morcha-samavesam-

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని భాజాపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆరోపించారు. కేంద్రంతో నాలుగున్నరేళ్లు కలిసి ఉండి రావాల్సిన నిధులు, అనుమతులను శరవేగంగా చేయించుకుని ఇప్పుడు ఏమి చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే అమిత్ షా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు.

bjp-youva-morcha

ABOUT THE AUTHOR

...view details