ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి' - bjp vishnu kumar on farmers problems

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ.. విశాఖపట్నం లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని కార్యాలయంలో బైఠాయించారు.

bjp protest at vishakapatnam to give MRP for farmers
bjp protest at vishakapatnam to give MRP for farmers

By

Published : Jun 9, 2021, 9:17 AM IST

రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం అన్యాయమని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. విశాఖపట్నం లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో మంగళవారం ఉదయం రైతులకు మద్దతుగా దీక్ష నిర్వహించారు.

ప్లకార్డులు పట్టుకొని కార్యాలయంలో బైఠాయించారు. రైతులకు ఏపీలో మోసం జరుగుతుందని విష్ణుకుమార్‌రాజు అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌, భాజపా నాయకులు కాశీవిశ్వనాథరాజు, కిసాన్‌ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details