ఇంటి పన్నులు, చెత్త, మురుగు నీటి పన్నుల పెంపును నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్యర్యంలో నిరసన చేపట్టారు. ప్రజలపై భారాన్ని మోపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేకతను చాటుతుందని సీఐటీయూ విమర్శించింది. పెంచిన పన్నుల భారాన్ని ఉపసంహరించాలని నినాదాలు చేశారు.
గాజువాకలో భాజపా నేతలు నిరసన చేపట్టారు. కరోనా భారంతో ప్రజలు తీవ్ర భాధలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపడం అన్యాయమని పార్టీ కన్వీనర్ కాన్నంరెడ్డి నర్సింగ్ రావు ఆగ్రహించారు. పార్టీ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో...