ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

vishnu kumar raju 'రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది' - BJP leader vishnu kumar raju

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భాజపా నేత విష్ణుకుమార్(vishnu kumar raju) రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, వైకాపా పాలనకు వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రజల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు

By

Published : Jul 11, 2021, 3:50 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తప్పుడు జాబ్ క్యాలెండర్​తో నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓబీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విష్ణు కుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, వైకాపా పాలనకు వ్యతిరేకంగా పోరాడకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details