ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఆరాచకాలకు ఈసీనే కారణం: భాజపా మాజీ ఎమ్మెల్యే - భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

స్థానిక ఎన్నికల ప్రక్రియలో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యాలు పాల్పడుతుంటే పోలీసులు, ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవటం దారుణమని భాజపా మాజీ ఎమ్మెల్యే విఘ్ణకుమార్ రాజు మండిపడ్డారు.

bjp-ex-mla-fire-on-election-commission
భాజపా మాజీ ఎమ్మెల్యే విఘ్ణకుమార్ రాజు

By

Published : Mar 15, 2020, 4:50 PM IST

భాజపా మాజీ ఎమ్మెల్యే విఘ్ణకుమార్ రాజు

ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా దాడులకు పాల్పడిందని భాజాపా నేత, మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇన్ని రోజులుగా దాడులు, ఘర్షణలు జరుగుతున్నా పోలీస్ శాఖ, ఎన్నికల కమిషన్ స్పందించక పోవడం వల్ల వైకాపా కార్యకర్తలు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు మందలిస్తే గాని ప్రభుత్వ వ్యవస్థలు దారికి రాకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను రద్దు చేసి మరలా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details