పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం వంటి మేఘాల సమూహం. మరో వైపు పచ్చని చెట్లతో పాటు పక్షుల కిలకిలారావాల సంగీతం. చల్లటి గాలలతో స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అందాలు విశాఖ జిల్లా వంజంగి సొంతం. సహజ సిద్ధ సౌందర్యంతో రంజింపజేస్తున్న ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించటానికి పర్యటకులు పోటీ పడుతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మిత్ర బృందాలు, కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ చల్లని ప్రాంతంలో సేదతీరుతున్నారు. అలాగే మేఘాల చాటు కొండలతో కనువిందు చేస్తున్న ఈ అందాలను పర్యటకులు తమ చరవాణిలో బంధిస్తున్నారు.