ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 6:57 PM IST

ETV Bharat / state

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై... వైకాపా నేతల సంబరాలు

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై వైకాపా నేతలు సంబరాలు చేసుకున్నారు. రాజ్యాధికారం దిశగా బీసీలు వేస్తున్న తొలి అడుగులుగా భావిస్తున్నామని వారు చెప్పారు.

bc corporations formed and ycp leaders celebrations
బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు.. వైకాపా నేతల సంబరాలు

రాష్ట్రంలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించడానికి వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వైకాపా శ్రేణులు పేర్కొన్నాయి. బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

నర్సీపట్నంలో...

రాష్ట్రంలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించడంలో తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ పేర్కొన్నారు. ఇటీవల బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు ఛైర్మన్లు, డైరెక్టర్ పదవులను కేటాయించడంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం వైసీపీ నాయకులు కోనేటి, ఇతర పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు.. వైకాపా నేతల సంబరాలు


విజయనగరంలో..

ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... విజయనగరం జిల్లా పార్వతీపురంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు స్థానికంగా ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రంగముద్రి రమాదేవి, డైరెక్టర్లు, నియోజకవర్గంలోని బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు

బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు.. వైకాపా నేతల సంబరాలు

తండ్రి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కొనియాడారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా బీసీ కులాలకు చెందిన ఛైర్మన్లు, డైరెక్టర్లులతో కలిసి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్... జ్యోతి రావు పూలే, విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కర్పొరేషన్ డైరెక్టర్​, చై ఛైర్మన్లతో సమన్వయంతో పనిచేసి బీసీ సంక్షేమానికి తోడ్పడతామన్నారు.

బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు.. వైకాపా నేతల సంబరాలు

కార్పొరేషన్ల డైరెక్టర్లుకు విప్ సన్మానం

బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, బీసీలకు ఉన్నత పదవులతో గౌరవాన్ని కల్పించారని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి నియమితులైన బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు సన్మాన కార్యక్రామాన్ని దేవరాపల్లిలో వైకాపా శ్రేణులు నిర్వహించారు. అంతకుముందు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు.. వైకాపా నేతల సంబరాలు

ఇదీ చూడండి:

నవంబరు 2 నుంచి పాఠశాలలు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details