ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2021, 8:01 PM IST

ETV Bharat / state

ఏయూ ఇంజ‌నీరింగ్ వ‌స‌తి గృహాల్లో 94 మందికి కరోనా

విశాఖ జిల్లాలోని ఆంధ్ర విశ్వవిద్యాల‌యం ఇంజ‌నీరింగ్ వ‌స‌తి గృహాల్లో 94 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. వైరస్​ సోకిన వారికి క్యాంపస్​లోనే క్యారంటైన్​ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఏయూ పరిధిలో జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌న్నింటినీ వాయిదా వేసినట్టు విశ్వవిద్యాల‌యం ప్రకటించింది.

Andhra university
ఆంధ్ర విశ్వవిద్యాల‌యం

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాల‌యం ఇంజ‌నీరింగ్ వ‌స‌తి గృహాల్లో 94 మందికి కరోనా సోకింది. దీంతో జిల్లా కలెక్టర్​ ఆధ్వర్యంలో మిగతా విద్యార్థులందరికీ కొవిడ్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివ‌ర‌కు బ‌య‌ట‌ప‌డిన పాజిటివ్ కేసుల్లో ఎవ్వరికి తీవ్ర ల‌క్షణాలు లేవ‌ని ఆర్డీవో కిశోర్​ తెలిపారు. వైరస్​ సోకిన వారికి ఇంజ‌నీరింగ్ బాయ్స్ హాస్టల్​లో క్వారంటైన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు ఏయూ అధికారులు స్పష్టం చేశారు.

ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏయూ అధికారులు తెలిపారు. కొవిడ్​ సోకిన విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తూ.. 24గంటలు వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిచామన్నారు. క్యాంపస్​లోని ఆర్ట్స్, సైన్స్, లా, ప‌రిశోధ‌క విద్యార్థులు ఉండే హాస్టల్స్ అన్నింటినీ ‌మూసివేయటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఏయూ పరిధిలో జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌న్నింటినీ వాయిదా వేసినట్టు విశ్వవిద్యాల‌యం ప్రకటించింది. ఇక‌పై అన్నీ ఆన్​లైన్ త‌ర‌గ‌తులే జ‌రుగుతాయ‌ని వెల్లడించింది.

ఇదీ చదవండి:విశాఖ-కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details