ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారంలో.. ఆసెట్ నోటిఫికేషన్ విడుదల - adhra university latest news

ఆసెట్‌ నోటిఫికేషన్‌ను వారం రోజుల్లో విడుదల చేస్తామని ఆంధ్ర విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ తేదీలను వెల్లడించిన ఆయన.. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

Asset entrance test notification
పరీక్షల నిర్వాహణ తేదీలను వెల్లడించిన వీసీ

By

Published : May 19, 2020, 12:01 PM IST

ఆంధ్ర విశ్వ విద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆసెట్‌ నోటిఫికేషన్‌ ను వారం రోజుల్లో విడుదల చేస్తామని వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తెలిపారు. జులై మొదటి వారం నుంచి డిగ్రీ పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

పీజీ ద్వితీయ సంవత్సర పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు జులై 16 నుంచి 30వ వరకు జరుగుతాయని వివరించారు. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఏయూ వెబ్​ సైట్‌ను సందర్శించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details