ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - vishakh municipal election counting news

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ మహానగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ వినయ్​చంద్ పర్యవేక్షించనున్నారు.

arrangements
విశాఖలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

By

Published : Mar 13, 2021, 9:35 PM IST

విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల అధికారి నాగలక్ష్మి పర్యవేక్షిస్తారు.

నర్సీపట్నంలో...

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 28 వార్డుల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఒకే సారి వెల్లడించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేకంగా జనరేటర్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొదటి నుంచి చివరి వరకు వీడియో తీయనున్నట్లు సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్​లు, ఎలక్ట్రానిక్ పరికరాలను లెక్కింపు కేంద్రంలోకి అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అన్ని సజావుగా సాగితే.. మొదటి మూడు గంటల్లోనే ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details