ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకు ఉత్సవ్​ నిర్వహణపై విశాఖ​లో మంత్రి అవంతి సమీక్ష - mla madhavi about araku utsavalu

విశాఖ కలెక్టరేట్​లో అరకు ఉత్సవ్​పై మంత్రి అవంతి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 1 వరకూ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఉత్సవ్​ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించినట్లు చెప్పారు.

araku utsav
అరకు ఉత్సవ్​ నిర్వహణపై విశాఖ కలెక్టరేట్​లో సమీక్ష

By

Published : Feb 25, 2020, 10:05 PM IST

అరకు ఉత్సవ్​ నిర్వహణపై విశాఖ కలెక్టరేట్​లో మంత్రి సమీక్ష

ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అరకు ఉత్సవ్ నిర్వహించేందుకు... విశాఖ జిల్లా యంత్రాంగం, పర్యటక శాఖ సిద్ధమవుతోంది. విశాఖ కలెక్టరేట్​లో అరకు ఉత్సవ్​పై మంత్రి అవంతి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 1 వరకూ ఎన్టీఆర్ మైదానంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గిరిజనుల అభివృద్ధి, ఆనందం కోసమే ఉత్సవ్ నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. గిరిజన సాంప్రదాయ వంటకాలు, పారామోటరింగ్ వంటి క్రీడలు, సినీ ప్రముఖులు సంగీత విభావరులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ ఈ ఉత్సవ్​కు ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details