ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాండవ జలాశయంలో అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే విహారం

By

Published : Nov 9, 2020, 10:04 AM IST

ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తాండవ జలాశయంలో విహరించారు. ఆ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి ముత్తంశెట్టితో కలిసి కృషి చేస్తామని తెలిపారు.

Araku MP, Paderu MLA wandering in the reservoir
జలాశయంలో విహరించిన అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నాటు పడవపై విహరించారు. కొయ్యూరు మండలం అడ్డాకుల గ్రామంలో ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వీరు సమీపంలోని జలాశయాన్ని సందర్శించారు. జలాశయానికి చుట్టూ కొండలు , ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకించి పరవశించారు. అనంతరం జలాశయం ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details