ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2022, 9:01 AM IST

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9AM

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • అయోమయంలో "పది" విద్యార్థులు.. చదివేది ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌.. రాసేది మాత్రం.!
    రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురుకానుంది. విద్యార్థులంతా ఎన్​సీఈఆర్​టీ సిలబస్సే చదువుతున్నా.. కొందరు మాత్రం సీబీఎస్​ఈ, మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయక తప్పేట్లు లేదు. రెండు రకాల సిలబస్, మార్కుల విధానంలో వ్యత్యాసం ఉండటంతో.. ఏం చేయాలా అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బెడిసికొట్టిన ప్రభుత్వ "స్మార్ట్​ మీటర్ల " దోపిడీ..రాష్ట్రంలో స్మార్ట్‌మీటర్ల కుంభకోణం త్రుటిలో తప్పింది. అంచనాలు భారీగా పెంచేసి, అస్మదీయుల సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు పన్నిన పన్నాగం ఫలించలేదు. ఇతర రాష్ట్రాల కంటే రెండు మూడు రెట్ల అధిక ధరలతో అడ్డంగా దోచేయాలన్న ప్రయత్నం ఆఖర్లో బెడిసికొట్టింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో నెలన్నర క్రితం టెండర్లను రద్దు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నెల్లూరు పౌరసరఫరాల సంస్థ కుంభకోణం.. సూళ్లూరుపేట ఆర్డీఓ అరెస్ట్​
    నెల్లూరు జిల్లా పౌరసరఫరాల సంస్థ కుంభకోణంలో పెద్ద వికెట్ పడింది. సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్‌మండ్‌ను ACB అరెస్టు చేసింది. కోర్టు ఆమెకు రిమాండ్‌ విధించింది. ఇప్పటికే ఈ కేసులో అనేకమంది సిబ్బంది కటకటాలపాలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్సా అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి.. 288 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపు
    ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి రామకృష్ణపై 288 ఓట్ల తేడాతో గెలుపొందారు. సచివాలయంలో 1,225 ఓట్లు ఉండగా.. 1,162 ఓట్లు వెంకట్రామిరెడ్డికి పోలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేంద్రం కీలక నిర్ణయం.. ఎయిర్‌పోర్టుల్లో ఫోన్లు, ఛార్జర్ల చెకింగ్​ బాధ ఉండదిక!
    విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులను 3డీలో చూపించే అత్యాధునిక స్కానర్లను ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇక బ్యాగుల నుంచి ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌టాప్‌ వంటివి బయటకు తీసి చూపించే బాధ ప్రయాణికులకు ఇక తప్పేలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేపాల్‌ సుప్రీంకోర్టు ఆదేశం.. సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ విడుదల!
    ఆరోగ్య కారణాల రీత్యా అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నేపాల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శోభరాజ్‌పై పెండింగు కేసులు లేకపోతే విడుదలైన తర్వాత స్వదేశానికి పంపేయాలని కోర్టు సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. మహమ్మారి ముగింపు దశలో ఇది 'వైల్డ్‌ కార్డు' ఎంట్రీనే!
    చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురిచేస్తోంది. మహమ్మారి ముగిసిపోతోందని భావిస్తోన్న సమయంలో చైనాలో ఇది వైల్డ్‌ కార్డేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రైవేట్​ క్రిప్టోలను పెంచి పోషిస్తే మరో ఆర్థిక సంక్షోభమే: RBI గవర్నర్​
    బిట్‌ కాయిన్‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పందించారు. వాటిని మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీగా పెరిగిన IPL విలువ.. రూ.87 వేలకోట్లకు పైగా..
    ఐపీఎల్‌ తాజాగా రూ.87 వేల కోట్ల విలువకు చేరుకుందట. డీఅండ్‌పీ అనే సంస్థ ఈ మేరకు ఐపీఎల్‌ విలువను లెక్కగట్టింది. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో ఐపీఎల్‌ మీడియా హక్కులు వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.48 వేల కోట్లు పలికింది. దీంతో ఐపీఎల్‌ విలువ కూడా పెరిగి 10.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • త్వరలోనే డైరెక్టర్​గా మూవీ తీస్తా.. కానీ అందులో నేను నటించను: అనుపమ
    అనుపమ పరమేశ్వరన్‌.. కథల్ని ఎంపిక చేసుకోవడంలో ఆమె ప్రత్యేకం. 'కార్తికేయ2'తో విజయాన్ని సొంతం చేసుకున్న అనుపమ.. నిఖిల్​తో కలిసి '18 పేజెస్‌'లో నటించింది. బుధవారం ఈ సినిమా థియేటరల్లోకి రానున్న నేపథ్యంలో ఆమె ముచ్చటించిన విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details