ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలపై మావోలు చేసిన దాడిని అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ఖండించింది. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నక్సల్స్ దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. దేశం అభివృద్ధి పధంలో నడుస్తుంటే , హింసాత్మక మార్గంలో నడిచే నక్సల్ విధానం రూపుమాపాలని నినాదాలు చేశారు. మరణించిన జవానుల కుటుంబాలకు ప్రగాడ సానుభతి తెలిపారు.
భద్రతా దళాలపై మావోలు చేసిన దాడిని నిరసిస్తూ ఆందోళనలు - ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్తత
ఛత్తీస్గఢ్ ఘటనతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజాపూర్ - సుకుమా జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో 22 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. జవాన్లపై దాడిని నిరసనగా అఖిల భారత్ విద్యార్థి పరిషత్ సభ్యులు ఆందోళన చేపట్టారు.
![భద్రతా దళాలపై మావోలు చేసిన దాడిని నిరసిస్తూ ఆందోళనలు Maoist attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11281521-664-11281521-1617590972683.jpg)
Maoist attack